Friday, 17 April 2026 08:24:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అంబేద్కర్ ఆశయ సాధనే యువత లక్ష్యం కావాలి అంబటి శ్రావణ్ కుమార్ యాదవ్ -ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 April 2026 04:12 PM Views : 56

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 14 అక్షరం న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఓదెల మండలం కొలనూరు గ్రామంలో తెలుగు ఇన్వెస్టర్ ఎస్ కే యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంబటి శ్రావణ్ కుమార్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్య మరియు ప్రాథమిక హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం విగ్రహాలను స్మరించుకోవడమే కాకుండా, ఆయన చూపిన బాటలో నడవడం మనందరి కనీస బాధ్యత అని ఉద్ఘాటించారు. నేటి యువత చదువు,క్రమశిక్షణ మరియు సామాజిక సమానత్వం వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే బాబాసాహెబ్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని వారు పిలుపునిచ్చారు.జై భీమ్ నినాదాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మాటూరి ఉపేందర్,పల్లె సుమన్,పల్లె సతీష్,బెజ్జాల రమేష్,చేనిగరపు నాగరాజు,తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :