Friday, 31 July 2026 08:13:43 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు పై హైకోర్టు లో వాదనలు.. ఈ నెల 21 లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలీ... హైకోర్టు.

ఈ నెల 27 వ తేదీన తుది వాదనలు వింటామన్న ఉన్నత ధర్మాసనం.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 07 January 2026 08:27 PM Views : 2522

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . హైదరాబాద్ / జనవరి 7 / అక్షరం న్యూస్ -: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను మరియు సుజాతనగర్ మండలం లోని 7 గ్రామ పంచాయితీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయటాన్ని చాలెంజ్ చేస్తూ ప్రముఖ న్యాయవాది జలసూత్రం శివరాం ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో వేసిన డబ్ల్యూ పి (పిల్) No.60/2025 కేసు లో బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ ముందు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ బలంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున కౌంటర్ వేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమయం అడగగా ఈ నెల 21 లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ కౌంటర్ కు సమాధానం దాఖలు చేయటానికి పిటిషనర్ కు రెండు రోజుల సమయం ఇచ్చింది. తదుపరి ఈ నెల 27 వ తేదీన తుది వాదనలు వింటామని ఉన్నత ధర్మాసన న్యాయ మూర్తి చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని అట్టి సందర్భంలో తమ కేసు నిరర్ధకం అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా తమ అధికారాలు ఏమిటో తమకు తెలుసునని పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తాము ఏ విధంగా ఆదేశాలు ఇచ్చామో గుర్తుంచుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :