D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మే20(అక్షరం న్యూస్) మహబూబాబాదు జిల్లా గంగారం రైతు వేదికలో రైతు నేస్తం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగారం మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొని శాస్త్రవేత్తల సూచనలను తెలుసుకోవడం జరిగింది కార్యక్రమం అనంతరం వ్యవసాయ అధికారి వేణు యాదవ్ రైతులతో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి,లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి, ఆ యొక్క రసీదును పంట పూర్తి కాలం వరకు రైతు దగ్గర భద్రపరచుకోవాలి, గ్రామాలలోకి నేరుగా వచ్చి విత్తనాలు అమ్మే వారి దగ్గర కొనుగోలు చేయకూడదు,అలాంటివారు ఎవరైనా మీ వద్దకు వస్తే తప్పకుండా వ్యవసాయ అధికారులకు తెలియజేయండి, ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొనడం జరిగింది
.
Aksharam Telugu Daily