D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) లౌకిక విలువల కోసం పోరాడిన ఏచూరి అని సిపిఐ పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ పేర్కొన్నారు. శుక్రవారం బైపాస్ రోడ్ కూరగాయలు మార్కెట్ లో సీతారాం ఏచూరి వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, సమానత్వం, సోషలిజంలపై ఆర్ ఎస్ ఎస్ దాని పనుపున నడుస్తున్న బీజేపీ కేంద్ర సర్కార్ తీవ్రమైన దాడి చేస్తున్న తరుణంలో దాన్ని ఎదిరించి పోరాడే శక్తులను ఐక్యపర్చి ముందుకు తీసుకుపోవడంలో ఏచూరి కృషి అసమానమైనది అని వై విక్రమ్ పేర్కొన్నారు. మన దేశంలో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న లౌకిక భావన పై బిజెపి ప్రభుత్వం దాడి చేయడం దేశ ప్రజలు గమనించాలని కోరారు. నూతన సంస్కరణలు పేరుతో దేశాన్ని కొల్లగొడుతున్న అదానీ, అంబానీ లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని, మరోవైపు బీజేపీ ప్రభుత్వం రెచ్చగొడుతున్న మత ఉన్మాదం పై ఏచూరి ఆశయాలతో తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు సైదులు, సీతయ్య, సత్యనారాయణ, వెంకన్న, శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి, గుమ్మడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily