Friday, 17 April 2026 09:30:44 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఏజెన్సీలో మద్యం టెండర్ల నోటిఫికేషన్ రాకముందే పెస గ్రామసభలు ఏంటి.... పాయం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 31 July 2025 05:21 PM Views : 632

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 31--- మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతాలలో మద్యం షాపుల టెండర్లు విధానము ఆయా పంచాయతీ పరిధిలో గల పార్లమెంటు చట్టం పెస ప్రకారంగా ఒకటి బై మూడవ వంతు కోరం గ్రామ సభలో ఆదివాసీలు ఉండాలని అన్నారు. పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా తూతూ మంత్రంగా పెస గ్రామసభ పెట్టి అధికారులే గ్రామసభ పూర్తి అయినట్టు తీర్మానాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అలా తప్పుడు పెస తీర్మానాలు చేస్తే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అధికార పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేల ఒత్తిడిలకు లోనై పార్లమెంటు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆదివాసి సంఘాలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చర్ల మేజర్ పంచాయతీ పరిధిలో ఆదివాసి ప్రజలకు ఆర్ ఓ ఎప్ ఆర్ భూమి సమస్య ఉంది. రెవిన్యూ భూమి సమస్య ఉంది. సహజ వనరుల అన్యాక్రాంతం సమస్య ఉంది. ముందుగా వీటిపై ప్రభుత్వం పెస గ్రామసభ నిర్వహించి ఆదివాసులకు ఆర్థిక ఫలాలు పెస పార్లమెంట్ చట్టం1996-98 రూల్స్ 2011 పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ వర్క్ ప్రెసిడెంట్ పూనెం వర ప్రసాదు ఆదివాసి విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దొర GSP నాయకులు ఇర్ప అరుణ్ కుమార్ తాటి వెంకటరావు బీరబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :