D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 3/తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట గ్రామం, వెంకట రాముని తండ లో ముందుగా ప్రముఖ సంఘ సేవకురాలు, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ భర్త అయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కిరాల నాగేశ్వరరావు, భూక్య బాలకృష్ణ లు శుభాకాంక్షలు తెలియజేసారు. మట్టా దయానంద్ విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా యు పి ఎస్ వెంగన్నపేట పాఠశాల మరియు యు పి స్ వెంకట్రాముని తండా పాఠశాల నందు 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు . పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులు, ప్రజలు మట్టా దయానంద్ విజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily