AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 15/అక్షరం న్యూస్/----- మండలంలోని తేగడ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు సమరయోధుల వేషధారణ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఒకటో తరగతి చదువుతున్న లశ్రీత భారతమాత వేషధారణ ధరించి సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి ప్రకృతిని ప్రేమించాలి. ఒకప్పుడు అమ్మ చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తే ఇప్పుడు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి ఏర్పడి రేడియేషన్ కు బలైపోతున్నారు మంటూ చక్కటి సందేశాత్మక ప్రదర్శనను సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేటట్టు ప్రదర్శించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థుల ప్రదర్శనకు పలువురు ముగ్ధులై పలువురు చిన్నారులను ప్రశంసల జల్లులతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయురాలు అరుణ రాజేశ్వరి పూజా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily