D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) తిరుమలాయపాలెం:తపాల శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ సూపర్ ఇన్ టెండెంట్ ఎస్ వీరభద్ర స్వామి అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ శాఖలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే నార్మల్ గా యాక్సిడెంట్ కు కొన్ని పద్ధతుల ద్వారా కొంత అమౌంట్ పూర్తిగా డెత్ అయితే పూర్తి ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని అతి తక్కువ ప్రీమియంతో ఇందులో పోస్టల్ శాఖలో ఏర్పాటు చేశారు తిప్పారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వేల్పుల భద్రమ్మ పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం చేయగా తనకు పూర్తిగా 1,8,000 ప్రీమియంను ఈరోజు చెక్కు అందించడం జరిగింది ఇదేవిధంగా పోస్టల్ శాఖలో వివిధ రకాల పాలసీలను ప్రవేశపెట్టింది ఐపీఎల్, ఐపీఈఎల్ , సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ సేవల ప్రయోజనాలను ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన వేల్పుల భారతమ్మకి, మరికొంత మంది పోస్టల్ పాలసీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల వీరన్న, పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ కాళీ మహేశ్వరి, ఖమ్మం పోస్టల్ శాఖ మేనేజర్ రాజేష్, బిపిఎం లు వెంకయ్య , పాండు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily