GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 9/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ ఆయాజ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ వన్ కమిషనర్ నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం 11వ వార్డుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ బిట్ల తిరుపతి కమిషనర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటినుండి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పట్టణ పరిశుభ్రతనే లక్ష్యంగా ప్రతి వార్డులో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజల కు అన్నివేళలా అందుబాటులో ఉంటూ పన్నుల వాసుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
.
Aksharam Telugu Daily