DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, డిసెంబర్ 12 – అక్షరం న్యూస్ ప్రతి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడుతున్న దినపత్రిక అక్షరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కొనియాడారు. ప్రజల సమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తెస్తూ, వినూత్న కథనాలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాపక్ష స్వరాన్ని బలంగా వినిపిస్తున్న అక్షరం పాత్ర అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో మార్పుకు దోహదపడే వార్తలతో పాటు విలువైన సమాచారాన్ని అందిస్తూ అక్షరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 ఆంగ్ల క్యాలెండర్ను మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో సోమవారం ఆవిష్కరించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అక్షరం ప్రయాణం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్ కాల్వ శ్రీరాంపూర్ పాత్రికేయుడు ఓడ్నాల అజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily