Saturday, 13 June 2026 03:46:22 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి .. మహిళల రక్షణ కోసం షి టీమ్ విద్యార్థినీలకు అవగాహన సదస్సులో ఎస్సై రామారావు

విద్యార్థినీలు ఏది చెడు ఏది మంచి అని గ్రహించాలి .


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 October 2025 08:06 PM Views : 516

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/వైరా అక్టోబర్ 24 (అక్షరంన్యూస్) విద్యార్థినీలు చదువుతోపాటు ధైర్యంగా ముందుకు సాగాలి అని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు, శుక్రవారం వైరా మండలం ముసలమడుగు సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం రెండో ఎస్ఐ పవన్, కానిస్టేబుల్ జ్యోతిర్మయి తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పాల రామారావు మాట్లాడుతూ విద్యార్థినిలు చాలా ధైర్యంగా ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించాలని మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని, మీ చదువు మీ విజ్ఞానాన్ని పెంచడంతోపాటు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి తోడ్పడుతుందన్నారు. ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ప్రభావాలకు లోను కావద్దని ముఖ్యంగా సదువుపై దృష్టి సాధించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మీ స్నేహితుల పట్ల తప్పుగా ప్రవర్తించిన అలాంటి వారి పట్ల ఎదురు తిరిగి మాట్లాడుతూ ధైర్యంగా పోలీసులకు తోటి విద్యార్థులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు వారి సమాచారాన్ని అందించాలన్నారు.ఎవరైనా మీ పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే వెంటనే వారికి పుల్ స్టాప్ పెట్టి విధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళల అభ్యున్నత కోసం రక్షణ కోసం తెలంగాణ పోలీస్ షి టిమ్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పలు ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :