Friday, 17 April 2026 09:36:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యూరియ ఇవ్వకుండా రైతులను ఏడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నశించాలి బీఎస్పీ మండల అధ్యక్షుడు కొండా కౌశిక్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 03 September 2025 07:18 PM Views : 515

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 3/ అక్షరం న్యూస్/---- తక్షణమే రైతులకు సరిపడా యూరియ అందుబాటులోకి తేవాలని రైతుల సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ నీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని బహుజనుల ఆత్మగౌరవం అభివృద్ధికోసం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఎస్పీ కి అధికారం ఇవ్వాలని మండల కేంద్రంలోని రైతు సహకార భవన్ చర్ల సొసైటీ నూ బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం సందర్శించడం జరిగింది.రైతులు యూరియ కోసం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మాట్లాడుతూ మట్టినే నమ్ముకుని ఉన్న రైతన్నలు ధాన్యం పండించే క్రమంలో లక్షల రూపాయలను వడ్డీలకు సైతం లెక్కచేయకుండా అప్పులు తెచ్చి తిని తినక ఆరుగాలం కష్టించి ఆ పైసలను తను పండించే పంటపై దార పోస్తారని పంట చేతికి రావడం కోసం ఎరువులను పై మందులను పిచికారి చేస్తేనే తప్పా ఆ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అయన అన్నారు. మరి అలాంటి సమయంలో రైతన్నలకు (యూరియా) ఎరువు బస్తాలు అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పులు అరిగేలా సొసైటీ చుట్టు తిరుగుతున్నారని ఇందుకు కారణం కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేనని అయన మండిపడ్డారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ప్రశ్నించారు. రైతే రాజు రైతు లేకపోతే దేశ అభివృద్ధి లేదు అని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. పది ఎకరాలు వరి పంట పండించే రైతుకి ఒక్కటే యూరియా బస్తా ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని ఇందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని ఆయన అన్నారు. ఎరువు బస్తాల కోసం రైతులను ఈ ప్రభుత్వం కాళ్ల చెప్పులు అరిగేలా తిప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తక్షణమే రైతులకు సరిపడా (యూరియాను) ఇతర ఎరువులను అందుబాటులోకి తెచ్చి రైతన్నలను కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఇలాగే కొనసాగితే భారత రాజ్యాంగానికి లోబడి బాధిత రైతాంగాన్ని మొత్తం పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని తద్వారా రైతాంగాన్ని కాపాడు కుంటామని ఆయన తెలిపారు. రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలను రానున్న స్థానిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని అయన పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్న బహుజన సమాజ్ పార్టీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల కోశాధికారి జహురుద్దీన్, ఈసీ మెంబర్ మడివి నందకిషోర్, సోషల్ మీడియా ఇంచార్జ్ చెన్నం పవన్ కుమార్ బాధిత రైతాంగం పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :