GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఏప్రిల్ -17(అక్షరం న్యూస్ ) పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కించపరచడమేనని ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడిదొడ్డి బాను కుమార్ తీవ్రంగా ఖండించారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో, సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మత విద్వేషాల కారణంగా జరిగిన దేశ విభజనతో పోల్చడం బీజేపీ అజ్ఞానం, విద్వేషపూరిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తెలంగాణలో ఓట్లు అడుగుతున్న బీజేపీ నేతలు, ఢిల్లీలో రాష్ట్ర గౌరవాన్ని అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily