D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 30 (అక్షరంన్యూస్) ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ముందుగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. లాకారం ట్యాంక్ బండ్ నుండి కెఎంసీ స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ సేవలు, దేశాన్ని ఏక్త బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు. యువత, ప్రజలు, వాకార్స్ అసోసియేషన్, సీనియర్ సిటీజన్స్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి, సమైక్యతా భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలి అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, సుశీల్ సింగ్, నర్సయ్య, డాక్టర్ ప్రదీప్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily