D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 తల్లాడ (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామం అభయాంజనేయ స్వామి దేవాలయం భూమి వివాదం పై గ్రామపంచాయతీ కార్యాలయంలో కల్లూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ తాసిల్దార్ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి అభయాంజనేయ స్వామి దేవాలయం భూమి వివాదంపై గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవాలయం సంబంధించిన భూమి కోర్టులో నడుస్తున్న దృష్ట్యా దేవాలయం ధూపదీప నైవేద్యాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్తుల సహకారంతో ఇరువర్గాలకు అనుకూలంగా కమిటీ నియామకం లేక ప్రభుత్వ ఎండోమెంట్ ద్వారా అర్జిత సేవలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని గ్రామ సభలో చర్చించారు. దీనికి ఇరువర్గాలు ఒప్పుకోకపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో గ్రామసభను వాయిదా వేశారు. గ్రామసభలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా తల్లాడ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభలో ఎంపీడీవో సురేష్ సర్పంచ్ నల్ల గొర్ల రాధ ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు ఎస్సై వెంకటేష్ నందిగామ శ్రావణి జయమ్మ రుక్మిణి అరుణ అనుమోలు రామారావు కొమ్మినేని ప్రభాకర్ రావు రామారావు గ్రామ పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily