Friday, 17 April 2026 09:38:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ.

డిసిసి అధ్యక్ష పదవి ఒక బాధ్యతాయుతమైన పదవి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీనీ కుటుంబ సమేతంగా కలిసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 March 2026 09:28 PM Views : 382

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/ వికారాబాద్ టౌన్ / మార్చ్ 2 / అక్షరం న్యూస్ - : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ను ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు వికారాబాద్ లోని హరిత వ్యాలీలో ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం 2 వ తేదీ ముగింపు కార్యక్రమానికి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాన్యశ్రీ గౌరవ రాహుల్ గాంధీ రావడం జరిగింది. వారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ కుటుంబ సమేతంగా కలిసినారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ డిసిసి అధ్యక్ష పదవి అనేది ఒక బాధ్యతాయుతమైన పదవి అని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండుకుంటూ అనునిత్యం ప్రజలకై ప్రజా సంక్షేమానికై ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటూ అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలవాలని రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను పాటు పడే వారిని అనునిత్యం ఖండించాలని గాంధీ మార్గంలో నడుచుకుంటూ ప్రజలకు మేలు చేసే విధంగా అధ్యక్షులు ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాలని వారితో ప్రేమగా మేలగాలని మహిళలను గౌరవించుకుంటూ వారి అభివృద్ధికి పాటుపడాలని సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, మరియు విశ్వనాథన్, సచిన్ సావంత్, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిలు పలక్ వర్మ , తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :