Friday, 17 April 2026 09:42:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మత సామరస్యానికి ప్రతీకలు ఇఫ్తార్ విందులు. కొత్త గూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజ్.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 March 2025 09:12 PM Views : 1200

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 19 / అక్షరం న్యూస్ - : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జీవించి నప్పుడే సమాజం లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజ్ అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రం పూర్ లోని మస్జీద్ - ఏ- ఖుభా లో జమాతే ఇస్లామి హింద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఒకరి పండుగలను మరోకరు గౌరవించుకోవాలని అన్నారు. కఠోరమైన ఉపవాసాలు మనిషి లో న్యాయం, ధర్మం, ఆప్యాయత అనురాగాలు పెంపోదిస్తాయని అయన తెలిపారు , ఎవరైతే నీతి నిజాయితీ, నైతికంగా ఉన్నతులో వారే నిజమైన దైవభీతి పరులని అన్నారు. మరో అతిధి యస్. ఓ. టు జి.యమ్ కోటి రెడ్డి మాట్లాడుతూ మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని మంచి మానవతా విలువలు పెంచే కఠోరమైన ఉపవాసాలు పాటిస్తూ దేశ వాసులంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన చేయాలి అని కోరారు. జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రంజాన్ మాసం లో ఉపవాసాలు మనిషి లోని చెడులను దూరం చేసి ఆకలి అంటే ఏమిటో ఆచరణాత్మకంగా తెలుసుకుని సమాజం లోని నిరుపేదలను ఆదుకునే గుణం అలవడుతుంది అని అన్నారు. ఈ మాసంలోనే మానవ జీవిత మర్మాన్ని తెలిపే ఖురాన్ అవతరించింది అని, మంచి చెడుల విచక్షణ తెలిపి ఋజు మార్గం చూపే బోధనలు ఇందులో ఉన్నాయి అని, ఆ బోధనలకు అనుగుణంగా జీవించేలా రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ యన్ టి యు సి ఏరీయా ఉపాధ్యక్షుడు రజాక్, కరుణాకర్ , రావూరి శంకర్, గూడెల్లి యాకయ్య, షమీం , ఆలం, సోనూ బాయ్, షబ్బీర్, రబ్బానీ, కరీం తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :