GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు16 అక్షరం న్యూస్ త్రివర్ణపతాకాన్ని అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు శనివారం పెద్దపల్లి పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అద్యక్షుడు వేల్పుల రమేష్ మాట్లాడుతూ, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని చింతలవాడలో బీడీ కాంట్రాక్టరు మొహమ్మద్ అంజద్ కుమారుడు మొహమ్మద్ నయ్యూర్ చెప్పులు వేసుకుని జాతీయజెండాను ఎగురవేయడం జరిగిందని తెలిపారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడముతో విషయం వెలుగులోకి వచ్చిందని రమేష్ తెలిపారు. జాతీయజెండాను అవమానిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగిందని రమేష్ వివరించారు. ఫిర్యాదు చేసిన వారిలో బిజెపి నాయకులు కావేటి రాజగోపాల్, పోల్సాని సంపత్ రావు, గుడ్ల సతీష్ తదితరులు ఉన్నారు
.
Aksharam Telugu Daily